కేంద్ర కార్మిక, ఉద్యోగ కల్పన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) ‘సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. మూడంచెల ఎంపిక ప్రక్రియ ద్వారా పోస్టుల భర్తీ చేపడతారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్వోలో కొలువులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం...
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీలు: 2,189.
తెలంగాణలో మొత్తం ఖాళీలు: 151 (ఎస్సీ 28, ఓబీసీ 53, ఈడబ్ల్యూఎస్ 16, అన్రిజర్వ్డ్ పోస్టులు 54).
ఆంధ్రప్రదేశ్: 60 (ఓబీసీ 24, ఈడబ్ల్యూఎస్ 5, అన్రిజర్వ్డ్ పోస్టుల సంఖ్య 31).
అర్హతలు..
విద్యార్హతలు :
- ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేదీ నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనలియర్ చదువుతూ ఫలితాల కోసం ఎదురుచూసే అభ్యర్థులు అనర్హులు.
- డేటాఎంట్రీ వర్క్ చేసే విధంగా గంటకు 5,000 కీ డిప్రెషన్స్ చేయగలిగే వేగం ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
- వయసు: జూలై 21, 2019 నాటికి 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల వయోసడలింపు ఉంది.
వేతనం: ఏడో పే కమిషన్ కింద గ్రేడ్ సి విభాగంలో నెలకు రూ.25,500 ప్రారంభ వేతనం అందుతుంది. దీనికి అదనంగా ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం :
ఈపీఎఫ్వోలో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మూడంచెల ఎంపిక విధానాన్ని అనుసరిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ స్కిల్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.
100 మార్కులకు ప్రిలిమ్స్ :
మొదట 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష విధానం..
సబ్జెక్ట్ |
ప్రశ్నలు |
మార్కులు |
సమయం |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ |
30 |
30 |
20 ని. |
రీజనింగ్ ఎబిలిటీ |
35 |
35 |
20 ని. |
న్యూమరికల్ ఎబిలిటీ |
35 |
35 |
20 ని. |
మొత్తం |
100 |
100 |
1గంట |
- ప్రిలిమినరీ కేవలం అర్హత పరీక్ష. ఇందులో పొందే మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ప్రిలిమినరీ మార్కుల ఆధారంగా రెండోదశ మెయిన్కు ఎంపిక చేస్తారు. కేటగిరీల వారీగా మొత్తం పోస్టులకు పదిరెట్ల మందిని మెయిన్కు అనుమతిస్తారు. ప్రిలిమినరీ పరీక్షను వేర్వేరు సెషనల్లో నిర్వహిస్తారు కాబట్టి నార్మలైజేషన్ విధానం అనుసరిస్తారు. రుణాత్మక మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
మెయిన్ పరీక్ష స్వరూపం :
ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్కు అర్హత లభిస్తుంది. మెయిన్ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతుంది. మొదట 200 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది ముగిసిన వెంటనే ఆన్లైన్లో డిస్క్రిప్టివ్ టెస్టు టైప్ చేయాలి.
పరీక్ష స్వరూపం :
సబ్జెక్ట్ |
ప్రశ్నలు |
మార్కులు |
సమయం |
రీజనింగ్/ఇంటెలిజెన్స్ |
40 |
60 |
35 ని. |
జనరల్/ఎకానమీ/ఫైనాన్షియల్ అవేర్నెస్ |
40 |
40 |
20 ని. |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ |
30 |
40 |
30 ని. |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ |
40 |
60 |
35 ని. |
మొత్తం |
150 |
200 |
2 గంటలు |
- ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ పరీక్ష 30 మార్కులకు ఆన్లైన్లో జరుగుతుంది. ఇందులో లెటర్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్, కాంప్రెహెన్షన్ సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్ నుంచి ఒక ప్రశ్న చొప్పున మూడు ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు చొప్పున 30 మార్కులు కేటాయించారు. ఈ విభాగానికి 45 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది.
- మొత్తంగా రెండో దశలో మెయిన్లో పొందే మార్కుల ఆధారంగా తదుపరి దశ ఫేజ్ 3కు అర్హత లభిస్తుంది. మెయిన్ పరీక్షలోనూ ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు రుణాత్మక మార్కుల విధానం అమలవుతుంది. ప్రతి తప్పు సమాధానానికి వాటికి కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు మార్కులు కోత పెడతారు. ఫేజ్ 2(మెయిన్) నుంచి ఫేజ్ 3కి అయిదు రెట్ల మందిని ఎంపిక చేస్తారు.
- ఫేజ్ 3లో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ (కంప్యూటర్ డేటా ఎంట్రీ టెస్టు) నిర్వహిస్తారు. ఈ దశలో అభ్యర్థి టైపింగ్ నైపుణ్యాలు పరీక్షిస్తారు. వేగం, కచ్చితత్వాన్ని లెక్కిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో పొందే మార్కులకు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
ముఖ్య తేదీలు : దరఖాస్తు రుసుం: రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్సర్వీస్ అభ్యర్థులకు రూ.250
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2019, జూలై 21.
హాల్టిక్కెట్ల డౌన్లోడింగ్ తేదీలు: ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 1 వరకు.
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2019, ఆగస్టు 31, సెప్టెంబర్ 1
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.epfindia.gov.in