సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సెస్సీ 2021 పబ్లిక్ పరీక్షలను ఏడు పేపర్లుగా నిర్వహించనున్నారు.

పాఠశాల విద్యాశాఖ గతంలోని జీవోలను సవరిస్తూ శుక్రవారం జీవో నం.8 విడుదల చేసింది. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఈ ఒక్క ఏడాది ఎస్సెస్సీ పరీక్షలను 7 పేపర్లలోనే నిర్వహించేలా ప్రభుత్వం తాజా జీవో విడుదల చేసింది.
ఏపీ టెన్త్ 2021 పబ్లిక్ పరీక్షల టైం టేబుల్
సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్, మోడల్ క్వశ్చన్ పేపర్స్, ప్రిపరేషన్ గెడైన్స్, కెరీర్ గెడైన్స్... ఇతర తాజా అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
2022 పబ్లిక్ పరీక్షలకు తిరిగి 11 పేపర్ల ప్యాట్రన్ అమల్లోకి వస్తుంది. 7 పేపర్లలో 5 పేపర్లు 100 మార్కుల చొప్పున, జనరల్ సైన్సులోని ఫిజికల్ సైన్సు 50 మార్కులకు, బయోలాజికల్ సైన్సు 50 మార్కులకు ఉంటాయి. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పేపర్లను వేర్వేరుగా వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారని జీఓలో పేర్కొన్నారు.